టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని స్టార్ డైరెక్టర్లుగా కూడా మారుస్తున్నారు అని సమాచారం. అంతేకాదు తమ ఖాతాలో అరుదైన రికార్డులు సృష్టిస్తున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నందమూరి హీరోలతో సినిమాలను తెరకెక్కించిన ఆరు మంది డైరెక్టర్లు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమ కెరియర్ ను కొనసాగిస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు అభిమానులు కూడా.. మరి వారెవరో ఇప్పుడు చదువు తెలుసుకుందాం.
1. రాజమౌళి:యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా ఇదే సినిమాతో రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకధీరుడుగా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
2. వివి వినాయక్:ఎన్టీఆర్ ఆది సినిమాతో వివి వినాయక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కూడా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
3. సురేందర్ రెడ్డి:కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఈయన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.
4. అనిల్ రావిపూడి:
పటాస్ సినిమా ద్వారా అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
5.K.V. గుహన్:
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో దర్శకుడిగా కె.వి.గుహన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
6.మల్లిడి వశిస్ట్:తాజాగా ప్రేమలేఖ రాశా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈయన ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక దర్శకుడిగా మొదటి అడుగుతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం జరిగింది.