ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ తలరాత ఒకటే..లాస్ట్ కి అలాంటి బ్రతుకే..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్ప కాదు..వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలవటం..లైఫ్ లాంగ్ ఆ పేరుని అలాగే ఉంచుకోవడం ముఖ్యం. ఈ గ్లామర్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి ముఖ్యంగా నేటి సమాజంలో పెళ్లి అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. అదేదో పాటలో చెప్పిన్నట్లు ..”చూసి చూడంగానే నచ్చేసావే..” అంటూ నచ్చిన వెంటనే లవ్ అని ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా పెళ్లి చేసుకోవడం..మ్యాటర్ ఫినిష్ చేయడం..అంతకంటే త్వరగా..విడాకులు తీసుకోవడం..ఇదే ఇప్పుడు సోసైటీలో మారుతున్న ట్రెండ్.

మరీ ముఖ్యంగా సినీ రంగంలో ఇలాంటివి ఎక్కువుగా చూస్తున్నాం . కాగా, ఇప్పటికే బోలెడు మంది హీరీ, హీరోయిన్స్, డైరెక్టర్స్..ప్రేమించి పెళ్లి చేసుకుని..కొన్నాళ్ళు కాపురం చేసాక ..”మా మధ్య బాండింగ్ లేదు” అంటూ విడాకులు తీసుకున్నారు. వీళ్లలో పిల్లలు ఉన్న వారు కూడా ఉన్నారు. పెళ్ళైన 20 ఏళ్లకి విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. అయితే, ఈ లిస్ట్ లోకి భవిష్యత్తులో మరో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కూడా చేరబోతున్నారు అంటు బిగ్ బాంబ్ పేల్చారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి.

ఇప్పటికే పలువురు బడా సెలబ్రిటీల జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పి హాట్ టాపిక్ మారిన వేణుస్వామీ..తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన నయనతార, రష్మిక, అనుష్క..జీవితాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన్నట్లు తెలుస్తుంది. వీరి ముగ్గురి జాతకంలో దోషాలు ఉన్నాయని..వాటి వల్ల వీళ్ళ వైవాహిక జీవితం సాఫీగా జరిగే సూచనలు కనిపించట్లేదని చెప్పుకొచ్చారు. నయనతార కూడా ఖచ్చితంగా డివర్స్ వరకు వెళ్తుందట. అంతేకాదు..అనుష్క, రష్మిక ల జీవితంలో పెళ్లి గడియలు చాలా లేట్ గా ఉన్నాయని.

కానీ, పెళ్లి చేసుకున్న ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు అని..వాళ్ల జాతకాల్లోని దోషాల కారణంగా త్వరగా విడాకులు తీసుకుని..లాస్ట్ కి సింగిల్ గానే మిగిలిపోతారట. కాగాం వేణుస్వామీ ఇది వరకే సమంత విడాకులు తీసుకుంటుందని ఆమె జాతకం బాగోలేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పిన్నట్లు చై-సామ్ డివర్స్ తీసుకున్నారు. దీంతో, నయన్, రష్మిక,అనుష్క జీవితాల్లో కూడా ఈయన చెప్పిందే జరుగుతుందా..వాళ్లకి లాస్ట్ సింగిల్ బ్రతుకేనా..అంటు బాధపడుతున్నారు అభిమానులు . ప్రస్తుతానికి అయితే నయన్ భర్త తో హ్యాపీగానే ఉంది. మరి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందా అంటే మాత్రం మనం చెప్పలేం. ..?