మా దేవుడు నువ్వేనయ్యా..!

మా దేవుడు నువ్వేనయ్యా…మాకోసం పుట్టావయ్యా అని చెప్పి పటాస్ సినిమాలో ఒక పాటని ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాగా తలుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే చంద్రబాబు మాత్రమే కాదు…పవన్ కూడా కావాలని పలువురు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. పవన్ ఉంటేనే తమ గెలుపు సాధ్యమని, ఏదేమైనా పవన్ తోనే పొత్తు ఉంటేనే బెటర్ అని, లేదంటే తమ గెలుపుకు దక్కదని పలువురు తమ్ముళ్ళు బెంగ పెట్టుకున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…పవన్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. గెలవాలన్న, ఓడిపోవాలన్న ఆయన చేతుల్లోనే ఉందని మాట్లాడుకుంటున్నారు.

గత ఎన్నికల్లో పవన్ వల్లే ఓడిపోయామని భావిస్తున్న తమ్ముళ్ళు…ఈ సారి పవన్ సపోర్ట్ ఉంటే గెలిచేస్తామని చెప్పుకుంటున్నారు. పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఘోరంగా ఓట్లు చీలిపోయి చాలామంది టీడీపీ నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. జగన్ గాలి కంటే కేవలం ఓట్లు చీలిపోవడం వల్ల చాలామంది తమ్ముళ్ళు నష్టపోయారు. ఉదాహరణకు కృష్ణాలో కొన్ని నియోజకవర్గాలు గురించి మాట్లాడుకుంటే…పెడన, మచిలీపట్నం స్థానాల్లో టీడీపీపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు వచ్చిన ఓట్లే ఎక్కువ. పెడనలో జోగి రమేష్..7 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే..ఇక్కడ జనసేనకు 20 వేల ఓట్లు వరకు పడ్డాయి…బందరులో కూడా ఇంచుమించు అదే పరిస్తితి.

ఇదే కాదు…అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, వెస్ట్ స్థానాల్లో అదే పరిస్తితి. ఇక గోదావరి జిల్లాల్లో తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, కొత్తపేట, కాకినాడ సిటీ, రూరల్, అమలాపురం, ముమ్మిడివరం ఇలా చెప్పుకుంటూ పోతే పలు నియోజకవర్గాల్లో టీడీపీపై వైసీపీకి వచ్చిన మెజారిటీ కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ.

అప్పుడే టీడీపీ-జనసేనలు పొత్తు ఉంటే ఆ స్థానాల్లో వైసీపీ గెలిచేది కాదు…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే…చాలామంది టీడీపీ నేతలు నష్టపోయేలా ఉన్నారు..అందుకే పవన్ తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పవనే తమని కాపాడాలని తమ్ముళ్ళు అంటున్నారు.