హైపర్ ఆది మొదటి పారితోషకం ఎంతో తెలుసా..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది కమెడియన్లలో హైపర్ ఆది కూడా ఒకరు. ఈయన జబర్దస్త్ ప్రముఖ కమెడియన్ అదిరే అభి సహాయంతో జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే తన మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా అలరించి, టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తర్వాత జడ్జిలపై, యాంకర్ పై రకరకాల కామెంట్లు చేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వించేస్తాడు. అప్పుడప్పుడు సెలబ్రిటీలపై చేసే వ్యాఖ్యలకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల అభిమానుల చేతుల్లో పూర్తిస్థాయిలో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే దర్శనమిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ అప్పుడప్పుడు సినిమాలలో అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కూడా నటిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా వెండితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు హైపర్ ఆది. ముఖ్యంగా ఈటీవీ మల్లెమాలవారు పండుగలు లేదా ముఖ్య దినాలలో ఏర్పాటు చేసే స్పెషల్ ప్రోగ్రామ్స్ లలో ఆది తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాతనే తాను 16 ఎకరాల భూమిని కొన్నాను అని రివిల్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ప్రస్తుతం ఉన్న భూముల ధరలలో ఏకంగా 16 ఎకరాలు కొనుగోలు చేశాడు అంటే మొదట ఆయన ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఉన్న టాప్ కమెడియన్ల లిస్టులో హైపర్ ఆది ఉండగా ఒకప్పుడు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశాడు. ఇక అలా అదిరే అభి టీం కి స్క్రిప్ రైటర్ గా పనిచేసినప్పుడు 2000 రూపాయలను పారితోషకంగా తీసుకున్నాడట. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.1.5 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.