“ఈ అక్కినేని హీరోలకు ఒకరు సరిపోరు”..టంగ్ స్లిప్ అయిన దిల్ రాజు..!?

పాపం..దిల్ రాజు ఒకటి అంటే జనాలకు మరోకటి అర్ధమైన్నట్లు ఉంది. దీంతో మరొసారి అక్కినేని ఇంటి పేరు మీడియాలో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే..ప్రజెంట్ అక్కినేని ఇంటి పరువు సగం కి పైగా పోయింది. అప్పట్లో కొంచెం నాగార్జున తీస్తే..ఇప్పుడు మిగిలిన కొంచెం నాగ చైతన్య, అఖిల్..తీసేశారు అంటున్నారు జనాలు. నాగార్జున మొదటి భార్య కి విడాకులిచ్చి రెండో పెళ్ళి చేసుకుంటే…

అఖిల్..నిశ్చితారధం చేసుకుని..బ్రేకప్ చేసుకున్నాడు. ఇక స్టార్ హీరో నాగ చైతన్య ఏకంగా డివర్స్ నే ఇచ్చేశారు. అఫ్ కోర్స్ ..రీజన్స్ ఏవైన కానీ..తప్పు ఎవరిది అయిన సరే..అందులో కొంత భాగం అక్కినేని కుర్రాళ్లది కూడా ఉంటుంది..అంటున్నారు జనాలు. దీంతో ఇండస్ట్రీలో మిగిలిన వారసులు అందరు అటు సినిమాల పరంగా..ఇటు ఫ్యామిలీ పరంగా బాగా సెటిల్ అవుతున్నా..ఇంకా ఈ అక్కినేని సన్స్ కెరీర్ లో నిలబడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఎప్పటికి సక్సెస్ అవుతారో కూడా తెలియని పరిస్ధితి ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు..వాళ్ల గత ట్రాక్ రికార్డ్ చూసి.

అయితే, రీసెంట్ “ధ్యాంక్యూ” సినిమాతో మరో సారి తన లక్ పరిక్షించుకోబోతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో ముగ్గురితో రొమాన్స్ చేశాడు..చైతన్య. దీన్నే సరదాగా నిర్మాత దిల్ రాజు ఈవెంట్ లో ప్రస్తావిస్తూ..”అక్కినేని హీరోలకు ఒక్క హీరోయిన్ ఏం సరిపోతాది..”అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతే, ఈ లైన్ పట్టుకుని అక్కినేని హేటర్స్..ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. “అవును అవును..మీరు చెప్పింది నిజమే..వీళ్లకి ఒకరు సరిపోరు లేండి”..అంటూ వల్గర్ కామెంట్స్ రెచ్చిపోతున్నారు. అసలే సమంత డివర్స్ తరువాత అక్కినేని ఫ్యామిలీని ఆడేసుకుంటున్న నెటిజన్స్ కు దిల్ రాజు టంగ్ స్లిప్ అయ్యి..వాళ్లను అడ్డంగా ఇరికించేసిన్నట్లైంది . మరి చూడాలి “ధ్యాంక్యూ” సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో..?