#NTR30: రావాల్సిన సమయం ఆసన్నమైంది.. గూస్ బంప్స్ డైలాగ్ తో అదరకొట్టేసిన తారక్..!!

ఫైనల్లీ..నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చేసింది. కోట్లాది అమంది అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన తారక్ తదుపరి సినిమా అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ తన్ నెక్స్ట్ సినిమా తో అంటూ అధికారికంగా ప్రకటిస్తూ.. సినిమా కు సంబంధించిన కీలక అప్డేట్ ను రిలీజ్ చేశారు. తారక్ కెరీర్ లో 30వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి # NTR 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి కొరటాల మాసివ్ వీడియోని రిలీజ్ చేశారు. ఆల్ రెడీ తారక్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో మళ్ళీ ఈ బ్లాక్ బస్తర్ కాంబో కుదరడం తో నందమూరి అభిమానులు ఈ సినిమా పై ఆశలు ఓ రేంజ్ లో పెట్టుకుని ఉన్నారు . రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా అభిమానులకు కొన్ని గంటల ముందే తారక్ బర్తడే ట్రీట్ ను అందించాడు. కొద్ది సేప్పటి క్రితమే #NTR30 సినిమా కి సంబంధించిన డైలాగ్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్నట్టు ఈ స్పెషల్‌ వీడియోను చూస్తే అర్థమవుతోంది. నేపథ్య సంగీతం ఓ స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా గా రిలీజ్ చేసిన వీడియో తారక్ చెప్పే డైలాగ్ యువత ని బాగా ఆకట్టుకుంటుంది. ” మాస్ బేస్ వాయిస్ తో తారక్..అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి దమ్ము ఉండకూడదు అని..అప్పుడు ఆ టైంలో భయానికి తెలియాలి..తాను రావాల్సిన సమయం ఆసన్నమైంది” అంటూ గూస్ బంప్స్ తెప్పించే డాలాగ్ చెప్పడం ..ఆ డైలాగ్స్ కి అనిరుధ్ మాస్ మ్యూజిక్..ఆ లుక్ చూస్తూ హెడ్ ఫోన్స్ లో సౌండ్ వింటుంటే…అద్దిరిపోది.

ఇక తాజాగా వదిలిన వీడియో తో సినిమా రివేంజ్ తో ముడిపడ్డిందంటూ క్లీయర్ గా చెప్పేశాడు కొరటాల శివ. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై క‌ళ్యాణ్ రామ్‌, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమా ఫుల్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతుందని టాక్ బయటకు వచ్చింది. కాగా, ఈ సినిమా లో హీరోయిన్లు అలియా..దిపీకా పదుకునే అంటూ వార్తలు వినిపించినా..ఫైఅన్ల్ గా అయితే రష్మిక మందన్నా..సాయి పల్లవి ఫైనల్ అయ్యిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక రేపు తారక్ సంబంధించిన మిగతా సినిమాల అప్ డేట్స్ రిలీజ్ కానున్నాయి.