హవ్వా..చరణ్ చేసిన ఆ పాపమే ..ఆచార్య కి తగ్గిల్లిందా..?

ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇదే. అన్నో ఆశలు పెట్టుకుని ధియేటర్ కి వెళ్ళి మా హీరో ఎలా చేశాడా అని ఎదురు చూసిన అభిమానుల నోట్లో మట్టి కొట్టాడు కొరటాల అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. మనకు తెలిసిందే ఎన్నో బ్రేక్స్ తరువాత చిరంజీవి-చరణ్ నటించిన ఆచార్య సినిమా నేడు ధియేటర్ లోకి గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురు చూసింది. ఏదో ఊహీస్తే ఇంకేదో జరిగింది అన్నట్లు ఉంది సినిమా పరిస్ధితి. అస్సలు ఈ స్టోరీని చిరు ఎలా యాక్సెప్ట్ చేశారా అంటున్నారు అభిమానులు.

మరోవైపు చిత్రానికి సంబంధించి వదిలిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. అయితే ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట చేసిన జనాలకు ఆచర్య రిజల్ట్ మింగుడుపడడంలేదు. ఇక సినిమా చూసి ధియేటర్ నుండి బయటకు వచ్చిన జనాల నోటి నుండి వస్తున్న మాటలు వినలేకపోతున్నాం. అంత దారుణంగా తిట్టిపోస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ ని. మెగా హీరోస్ తో తీయ్యాల్సిన అంటువంటి సినిమా నా అయ్యా ఇది అంటూ..ఫైర్ అవుతున్నారు. మరోపక్క మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సర్కారు వారి పాట హిట్ అవుతుంది అంటూ హైలెట్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే కొందరు..చరణ్ పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన్న RRR లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే.

ఈ సినిమాలో చరణ్-తరక్ నటించగా.. చరణ్ నే హైలెట్ అయ్యారు. ఒకానోక టైంలో తారక్ ని కావాలనే తొక్కేశారు అన్న కామెంట్స్ వినిపించాయి. సినిమాలో చరణ్ ని హీరో ని చే తారక్ కు అన్యాయం చేశారంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఏ ప్రెస్ మీట్ కెళ్లినా చరణ్ ని సూపర్ డూపర్ అంటూ పొగిడేశేవారు. ఇప్పుడు RRR లో చరణ్ చేసిన మోసమే.. ఆచార్య సినిమాని దెబ్బెసిందని ఓ బ్యాచ్ ప్రచారం చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ముదిరిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆచార్య సినిమా పై మరింత నెగిటీవ్ టాక్ ఏర్పడింది. మరి చూడాలి ..ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో..?