మహేష్ బాబు కౌంటర్ జర్నలిస్ట్ కా..? లేక మిగతా హీరోలకా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు. సార్.. చాలా సాఫ్ట్..పక్క వాళ్ళ మ్యాటర్ లో వేలు పెట్టడు..తన జోలికి వస్తే వేలు విరిచేస్తాడు. మాస్ డైలాగ్స్ తో తొడకొట్టి శపధాలు చేయడం ఈయనకు తెలియదు. సైలంట్ గా సాఫ్ట్ గా నే తాను చెప్పాలి అనుకున్నది కూసింత గట్టిగానే చెప్తాడు. ప్రజెంట్ డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా లో హీరో గా నటిస్తున్న ఈయన..మరికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని..సమ్మర్ కానుకగా మే12 న ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఈ సినిమా తరువాత మాటల మాత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరొ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా కు కమిట్ అయ్యాడు మహేష్ బాబు. ఈ సినిమా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ జంట పై అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోను త్రివిక్రమ్ డైరెక్షన్ అంటే ఇక చెప్పనవసరం లేదు..కిర్రాక్ గా ఉంటాది. ఈ సినిమా కి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా, రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈయనకి ఎదురైన ప్రశ్నలకి మహేష్ ఇచ్చిన ఆన్సర్స్ కాంట్రవర్షీయల్ గా మారాయి.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్‌ ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నిస్తూ..” ప్రజెంట్ అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు.. హిందీ సినిమాలు చేస్తున్నారు కదా. మరి మీరు కూడా నేరుగా హిందీ సినిమా చేస్తారా ? అలాంటి ఆలోచనలు ఉన్నాయా..? అంటూ నవ్వుతూనే అడిగేశాడు ఆ జర్నలిస్ట్‌. మహేష్ కూడా స్మైల్ ఇస్తూనే గట్టి తగ్గిలేలా ..” బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే ఖచ్చితంగా హిందీలోనే సినిమా చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ప్రతి తెలుగు సినిమా ని ప్రపంచమంతా చూస్తున్నారు. అలా అనుకుంటే తెలుగులో సినిమాలు తీసినా చాలు. అలా కూడా బాలీవుడ్ ప్రజలని మెప్పించవచ్చు” ..అంటూ తనదైన పంచ్‌ డైలాగ్‌తో ఆన్సరిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే దీని పై కొందరు ట్రోల్ చేస్తూ..ఈ ఆనసర్ జర్నలిస్ట్ కి ఇచ్చిన్నట్లా..? లేక ఆ సాకుతో పాన్ ఇండియా సినిమాలు అంటూ బాలీవుడ్ లో మకాం వేయ్యాలి అనుకుంటున్నా మిగతా హీరోలకి ఇచ్చిన్నట్లా అంటూ తెగ చర్చించుకుంటున్నారు. దీంతో మహేష్ కామెంట్స్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి.