పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. సాహో తర్వాత మూడేళ్ల లాంగ్ గ్యాప్తో ప్రభాస్ నటించిన ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1960లో యూరప్లోని ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా.. దీనికి తోడు ప్రభాస్ సినిమాలో జ్యోతిష్యుడి పాత్రలో కనిపిస్తుండడంతో సినిమా ఏదో సంచలనం నమోదు చేస్తుందనే అంటున్నారు.
ఈ సినిమా ఇండియాలోనే బ్రేక్ ఈవెన్కు రావాలంటే రిలీజ్ చేస్తోన్న అన్ని భాషల్లోనూ కలుపుకుని రు. 200 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ రోజు అర్ధరాత్రి దాటినప్పటి నుంచే ప్రీమియర్ల హంగామా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ భారీ సినిమాను చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వేళ ఏపీలో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు అటు అమెరికాలో ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయో లేదా ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసి మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది.
తెలంగాణలోనూ భారీ ఎత్తున బుకింగ్స్ నడుస్తున్నాయి. ఏపీలో మాత్రం చాలా చోట్ల బుకింగ్లు ఓపెన్ కాలేదు. ఏ బుకింగ్ యాప్ల్లో కూడా ఇంకా బుకింగ్స్ స్టార్ట్ కాకపోవడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో యాప్లలో బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.he shyam