రూట్ మారుస్తున్న త్రివిక్ర‌మ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?

యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్ర‌మ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి దోస్త్ లు. బాగా క్లోజ్ ..పవన్ ఒక్క మాట చెప్పితే దాని తూ.చా. తప్పకుండా పాటిస్తాడు త్రివిక్ర‌మ్ అని ఇండస్ట్రీలో పేరుంది.

పవన్ సినిమా కెరీర్ కి త్రివిక్ర‌మ్ ఎంతో హెల్ప్ చేశారు. మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు. దీంతో స్నేహం బాగా ముదిరిపోయింది. రీసెంట్ గా పవన్ నటించిన భీమ్‌లా నాయక్ కు అన్ని తానై చూసుకున్నాడు. ఈ సినిమాను తెరక్కెకించడంలో సాగర్ చంద్ర పేరుకే డైరెక్టర్..బ్యాక్ గ్రౌండ్ లో మ్యాటర్ అంతా నడిపించింది త్రివిక్ర‌మ్ నే అని టాక్ కూడా ఉంది. తెర పై ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. సినిమాలో త్రివిక్ర‌మ్ హ్యాండ్ బాగా కనపడింది అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. ఏది ఏమైతేనేం సినిమా హిట్ అయ్యిందిలే చాలు అనుకున్నారు.

కానీ ఇప్పుడు అసలకే మోసం వచ్చేటట్లు ఉంది జరగబోయేది వింటుంటే. ప్రస్తుతం త్రివిక్ర‌మ్ మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ పవన్ తోనే ఓ మూవీకి కమిట్ అయ్యాడట. అంతేకాదు..తాజాగా పవన్ నటించబోయే మరో రెండు సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించబోతున్నాడట త్రివిక్రమ్.

త్రివిక్ర‌మ్ కు పవన్ అంటే ఇష్టమే కావచ్చు ఆయన అభిమానే అయ్యుండచ్చు..కానీ త్రివిక్ర‌మ్ కి అభిమానులు ఉన్నారు కదా..ఆయన పవన్.. పవన్.. పవన్,, అంటూ ఒక్క హీరోతోనే టైం వేస్ట్ చేసుకుంటే ..తీరా ఆయన లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే..స్టోరీలో ఆయన పవన్ తప్పిస్తే మరోకరు ఉండరు అంటూ సినిమాటిక్ డైలాగ్స్ తో నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు ముందు డైరెక్షన్ పై దృష్టి పెట్టు సామీ అంటూ ఫన్నీ మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు.