ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .

ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు.

మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ రాష్ట్రాల బిల్లుల్ని పాస్ చేశారు .కానీ మీరు ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల విభజన చాలా ఘోరంగా చేశారు .సభలో మైకులు కట్ చేసి , పేపర్ స్ప్రే చల్లి , లోకసభ తలుపులు మూసి ,ఎలాంటి చర్చలు జరగకుండా బిల్లలు పాస్ చేశారు .అందుకే ఈ రోజుకి ఆంధ్ర ,తెలంగాణ ఇంకా ఇబ్బంది పడుతున్నాయి అంటూ కాంగ్రెస్ పార్టీపై మరొక సారి ఘాటు వ్యాఖ్యలు చేసారు .