రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్ .ఈ సినిమా ఒక పీరియాడిక్ లవ్స్ స్టొరీ గా భారీ బడ్జెట్ తో డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఈ సినిమా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉన్నది. అయితే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో రామోజీ ఫిలింసిటీలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు జాతిరత్నాలు సినిమా హీరో నవీన్ పోలిశెట్టి యాంకర్ గా చేశారు.
అయితే నవీన్ పోలిశెట్టి యాంకర్ గా ఎందుకు చేశారు?. అతడికి ఈవెంట్ కి చేయమని ఎవరు సలహా ఇచ్చారు.?. అతడి రెమ్యూనరేషన్ ఎంత అందుకున్నాడని విషయం ఎప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త. అయితే నవీన్ పోలిశెట్టి తెలుగు ప్రేక్షకులను కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాగా సుపరిచితమే. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్.. కు నవీన్ పోలిశెట్టి ని తీసుకోమని నాగ్ అశ్విన్.. ప్రభాస్ కు తెలియజేసినట్లు సమాచారం.
ఇక అంతే కాకుండా నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ని ప్రభాస్ విడుదల చేసి సినిమా సక్సెస్ కి తన వంతు సహాయం అందించాడు.దీంతో కృతజ్ఞతా భావంతో నవీన్ పోలిశెట్టి..ఈ ఈవెంట్ ను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసినట్లు సమాచారం.