తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో అంగ రంగ వైభవంగా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్, ప్రియాంక(పింకీ), సిరిలు నామినేషన్లో ఉండగా.. అందరూ ఊహించినట్టుగానే పింకీ దుకాణం సద్దేసుకుని ఇంటి బాట పట్టింది.
ఇక పింకీ వెళ్తూ వెళ్తూ ఇంటి సభ్యులపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మానస్పై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్లోకి వచ్చినప్పుడు సిల్కీ హెయిర్తో బాగున్నాడనిపించింది. అయితే ఆయన్ని పలకరించగా.. పట్టిచుకోకుండా వెళ్లిపోయాడు.
దాంతో మానస్కి ఎంతో పొగరు అనుకున్నానని.. కానీ, ఆ తర్వాత తమ మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపింది ప్రియాంక. అయితే తన నుంచి ఏం ఆశిస్తున్నావు అనే ప్రశ్నకు పింకీ మానస్ని విన్నర్గా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో ఎప్పటికీ మానస్ ఫ్రెండ్షిప్ కావాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. ఇక ప్రియాంక మాటలతో మానస్ ఎంతో ఖుషీ అయిపోయాడు.
కాగా, ప్రియాంక మొదటి నుంచీ మానస్పైనే దృష్టి సారించింది. గేమ్ను పక్కన పెట్టేసి మానస్ జపం చేస్తూ అతడి వెంటే తిరిగేది. అయితే అదే ఆమెకు మైనస్గా మారింది. ఆ కారణంగానే ప్రియాంక టాప్ 5లోకి చేరకుండానే ఎలిమినేట్ అయిందని టాక్.