కీర్తి సురేష్‌కి భ‌ర్త‌గా మార‌బోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో భ‌ర్త‌గా మార‌బోతున్నారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు నాగ శౌర్య‌. అయితే కీర్తి సురేష్‌కి శౌర్య భ‌ర్త మారబోయేది రియ‌ల్‌గా కాదండోయ్‌.. రిలీగానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలో అజిత్ కుమార్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `వేదాళం`కు రీమేక్‌కు భోళ శంక‌ర్ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా మెర‌వ‌బోతుండ‌గా.. చిరంజీవికి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ భ‌ర్త పాత్ర కూడా ఉంటుంద‌ట‌. ఇప్పుడు ఆ పాత్ర కోసం నాగ శౌర్య‌ను ఎంపిక చేశార‌ట మేక‌ర్స్‌.

ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ నాగ శౌర్య‌ను సంప్ర‌దించ‌గా.. చిరంజీవి సినిమా కావ‌డంతో ఆయ‌న ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు, త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌కట‌న కూడా రానుంద‌ని టాక్‌. మ‌రి ఈ ప్ర‌చారం నిజ‌మో.. కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ ద‌గ్గ‌ర నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

కాగా, ఇటీవ‌లె ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2022 చివ‌ర్లో ఈ సినిమా విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.