టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటిన అందాల భామ ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నది. అయితే ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తఫా 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పార్థలతో విడిపోయారు.
ఇక మొన్నీ మధ్య ప్రియమణి-ముస్తఫా వివాహం చెల్లదు.. ఆయన ఇంకా నా భర్తే అంటూ రంగంలోకి దిగింది ఆయేషా. ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తఫాల మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు, వీరు త్వరలోనే విడాకులు కూడా తీసుకోనున్నారని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ విషయంపై తనదైన శైలిలో గుట్టు విప్పింది ప్రియమణి. దీపావళి సందర్భంగా భర్త ముస్తఫా రాజ్తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ పిక్స్లో ప్రియమణి భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆనందంగా కనిపిస్తోంది. దీంతో విడాకుల రూమర్స్పై ఆమె పరోక్షంగా చెక్ పెట్టినట్టైంది.
https://www.instagram.com/p/CV4Zc01h96W/?utm_source=ig_web_copy_link