బుల్లితెరపై హాట్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్పై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తున్న అనుసూయ.. మరోవైపు బిగ్ స్క్రీన్పై సైతం సత్తా చాటుతూ ఓరా అనిపిస్తోంది. పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లైనా అందాల ఆరబోతలో వెనక్కి తగ్గకపోవడంమే అనసూయకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతోంది.
ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆచార్య, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు మలయాళంలో ముమ్ముట్టితో ఓ చిత్రం, తమిళంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రం చేస్తోంది. కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉండే అనసూయ.. తన అందచందాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంటోంది.
ఇక సంపాద విషయానికి వస్తే.. అనసూయ రెండు చేతులా సంపాదిస్తూ భారీగానే ఆస్తులను కూడబెట్టింది. నాగా సినిమాలో తొలిసారి నటించి 500 రూపాయలతో తన సంపాదన మొదలుపెట్టిన అను.. జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా మారింది. మొదట్లో ఈ షోకి పది వేలు తీసుకునే అనసూయ.. ఇప్పుడు రూ. 2 లక్షల చప్పున ఛార్జ్ చేస్తోంది.
అలాగే సినిమాలైతే పాత్ర బట్టీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే ఈ భామ.. స్పెషల్ సాంగ్స్కి రూ.10 లక్షలకుపైగా పుచ్చుకుంటుందట. ఇక అనసూయకు మణికొండలో రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఇండివిడ్యువల్ హౌస్, ఖరీదై రెండు కార్లు ఉన్నాయట. మొత్తం మీద ఆమె సంపాదించిన ఆస్థి, ఆమె సొంత ఆస్థి కలిపితే రూ. 12 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు.