ద‌స‌రా బ‌రిలోంచి త‌ప్పుకున్న `వరుడు కావలెను`..కార‌ణం అదేనా?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ శౌర్య న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మి సౌభాగ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Official: Naga Shaurya Varudu Kaavalenu release date locked

అలాగే సూర్య దేవ‌ర‌ నాగ వంశీ నిర్మించిన ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను కూడా వదిలారు. కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ద‌స‌రా బ‌రిలోంచి ఈ మూవీ త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.

Pic Talk: Uber Cool Naga Shaurya from Varudu Kaavalenu

అక్టోబర్ 14వ తేదీన `మహాసముద్రం` విడుదల ఉన్నప్పటికీ, జోనర్ వేరు గనుక `వరుడు కావలెను` ఆ మరుసటి రోజునే ఎంచుకుంది. కానీ, అదే రోజు అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`, యంగ్ హీరో రోషన్ `పెళ్లి సందD` చిత్రాలు బ‌రిలోకి దిగాడు. ఈ పోటీ కార‌ణంగానే శౌర్య వెన‌క్కి త‌గ్గి.. నవంబర్ మొదటివారంలో రావాల‌ని చూస్తున్నాడ‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.