తల్లి రుణం తీర్చుకోవడానికి శీలాన్ని పణంగా పెట్టిన 11 యేళ్ల బాలిక..!

అమ్మాయి పుడితే భారం గా భావించే ఈ రోజుల్లో ఒక బాలిక తన తల్లి రుణం తీర్చుకోవడానికి ఏకంగా ఎవరు చేయలేని సాహసాన్ని చేసింది ఈ బాలిక. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగూర్ జిల్లాలో క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని రక్షించుకోవడం కోసం మెరుగైన చికిత్స పొందాలి అంటే, డబ్బులు అవసరం అయ్యాయి.. అయితే ఆ బాలిక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏకంగా వ్యభిచారం చేయడానికి సిద్ధమైంది..

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ కుటుంబం డబ్బుల కోసం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుండడంతో ఆమె తల్లి అర్చన అనే మహిళను తన కూతురుకి ఏదైనా పని ఉంటే చూడమని కోరింది.. ఇక దాన్ని ఆసరాగా చేసుకొని అర్చన బాలికను వ్యభిచార రొంపులోకి దింపి డబ్బులు సంపాదించాలని నిర్ణయం తీసుకుంది. అర్చన తన స్నేహితులైన కవిత, మెస్రం రంజమ్మ తో కలిసి బాలిక వర్జిన్ అని ఒక కష్టమర్ ని వెతికి, ఏకంగా 40 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతే కాదు ఆ బాలికకు లేనిపోని మాయమాటలు చెప్పి , వ్యభిచారం చేయడానికి సిద్ధం చేశారు..

తన తల్లి ఆరోగ్యం కోసం బాలికకు 5000 ఇస్తామని చెప్పి, కస్టమర్ తో 40 వేల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు.. తర్వాత బాలికతో ఈ ముగ్గురు మహిళలు కలిసి నాగపూర్లోని కరోడ్ ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ కి తీసుకెళ్లారు. కానీ సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు అదే అపార్ట్ మెంట్ కు చేరుకొని తనిఖీలు నిర్వహించారు.ఇక ఈ ముగ్గురు మహిళలను అరెస్టు చేసి ,బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.