న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్కత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.
అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది. అందుకు కారణం బాలయ్యే. అవును, బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో తెరకెక్కిన `అఖండ` చిత్రాన్ని డిసెంబర్ 24నే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాదాపు తేదీని కూడా లాక్ చేశారట.
ఈ నేపథ్యంలోనే బాలయ్య కోసం నాని వెనక్కి తగ్గబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో ఇప్పుడీ విషయం నాని ఫ్యాన్స్ను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. ఎందుకంటే నాని బిగ్ స్క్రీన్పై కనిపించి చాలా కాలమే అయింది. ఆయన గత చిత్రాలైన వి, టక్ జగదీష్లు ఓటీటీలోనే విడుదల అయ్యాయి. శ్యామ్ సింగ రాయ్ తో అయినా నానిను థియేటర్లో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినిమా వాయిదా పడనుందని వార్తలు రావడం ఆయన ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తుంది.