టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను డిసెంబర్ 17న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా వచ్చేసింది. `నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ` అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
హీరోను ఉద్దేశిస్తూ హీరోయిన్ పాడే ఈ మాస్ బీట్ సాంగ్లో రష్మిక పల్లెటూరి అందాలు మరియు ఆమె డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, ద్రబోస్ మరోసారి అద్బుతమైన లిరిక్స్ తో తెలుగుదనం ఉట్టిపడేలా రాసిన ఈ పాటను మౌనిక యాదవ్ ఆలపించగా.. దేవిశ్రీ ట్యూన్ అందించారు.