గత కొద్ది రోజులగా పూనమ్ కౌర్ పేరు వార్తల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని మురళీ కృష్ణ బయటపెట్టడంతో పూనమ్పైనే అందరూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్గా మారింది.
అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగబోతుండగా.. అటు విష్ణు ప్యానల్, ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూనమ్ కౌర్ ప్రకాశ్ రాజ్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రకాశ్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
ఆయన గెలవాలి, ఒకవేళ ఆయన గెలిస్తే ఎంతో కాలం నుంచి నేను మాట్లాడుకుండా నోరు మూసుకుని ఉన్నటు వంటి సమస్యలు, నేను పడిన బాధలన్నీ చెబుతాను` అంటూ ప్రకాశ్ రాజ్తో దిగిన ఫొటోను షేర్ చేసింది. దాంతో ఆమె ట్వీట్ కాస్త వైరల్గా మారింది.
https://twitter.com/poonamkaurlal/status/1443931761092685831?s=20