సినిమాల్లోకి వ‌చ్చాక నాక‌వి పెరిగాయి.. పూజా హెగ్డే బోల్డ్‌ కామెంట్స్‌!

పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత చేసిన అన్నీ చిత్రాలు హిట్ అవ్వ‌డంతో.. పూజా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.

Pooja Hegde, Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal  2021; first poster unveiled-Entertainment News , Firstpost

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ భామ‌.. తెలుగులో నటించిన తాజా చిత్రం `మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌`. అఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే పూజా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Pin on Pooja hegde

సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని తెలిపిన పూజా.. ఓర్పు, సహనం పెరిగాయని చెప్పుకొచ్చింది. ఆర్టిస్ట్‌ల కాంబినేషన్లో సీన్స్‌ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని.. ఈ టైమ్‌లో సహనం చాలా అవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఒక్క సినిమా సక్సెస్‌ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకుంటార‌ని, కానీ అవేమి తాను ప‌ట్టించుకోన‌ని పూజా స్ప‌ష్టం చేపింది.