పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత చేసిన అన్నీ చిత్రాలు హిట్ అవ్వడంతో.. పూజా స్టార్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే పూజా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని తెలిపిన పూజా.. ఓర్పు, సహనం పెరిగాయని చెప్పుకొచ్చింది. ఆర్టిస్ట్ల కాంబినేషన్లో సీన్స్ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందని.. ఈ టైమ్లో సహనం చాలా అవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఒక్క సినిమా సక్సెస్ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకుంటారని, కానీ అవేమి తాను పట్టించుకోనని పూజా స్పష్టం చేపింది.