టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో మహేష్ బాబు-నమ్రత జంట ఒకటి. `వంశీ` సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మహేష్-నమ్రతల వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్గా జరిగింది.
ఈ జంటకు ఇద్దరు పిల్లలు(గౌతమ్, సితార) ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత.. మహేష్కు సంబంధించిన అన్ని విషయాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాతే హీరోగా మహేష్ బాబు కెరీర్ స్పీడ్ అందుకుంది. ఇక వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యాలకు ఎప్పుడూ దూరంగానే ఉండే నమత్ర.. ఒకానొక సమయంలో తన భర్తతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో గొడవ పెట్టుకుందట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అమృత రావ్. ఈ భామ మహేష్ సరసన `అతిథి` సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. అమృత మాత్రం మహేష్కు చాలా చనువుగా ప్రవర్తించేదట. ఈ విషయం తెలుసుకున్న నమ్రత.. అమృతను కలిసి తన భర్తకు దూరంగా ఉండమని స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చిందని అప్పట్లో ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి.