కీర్తి సురేష్‌తో నమ్రత ముచ్చ‌ట్లు..నెట్టింట పిక్‌ వైర‌ల్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మితమ‌వుతోంది.

Sir Padukune Mundhu Dhisti Theeyadam Marchipokandi: Keerthy To Namrata -

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఉండ‌బోతోంది. ఈ మూవీని సంక్రాంతి పండగ కానుక‌గా వ‌చ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ దేశంలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది.

Mahesh Babu spends quality time with wife Namrata Shirodkar and son in Paris after shooting for Maharshi

అయితే మ‌హేష్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి నమ్రతా శిరోద్కర్ కూడా స్పెయిన్ వెళ్లింది. అంతేకాదు, తాజాగా స‌ర్కారు వారి పాట సెట్స్‌కి వెళ్లిన న‌మ్ర‌తా.. హీరోయిన్ కీర్తి సురేష్‌ను క‌లుసుకుని కాసేపు ముచ్చ‌ట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన పిక్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Namrata and Keerthy Suresh Meet n greets