ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ …?

మహేంద్ర సింగ్ థోనీ… ఈ పేరు వింటే చాలు ఎవరికన్నా సరే రోమాలు నిక్కపొడుస్తాయి. థోనీ కనుక మైదానంలో ఆడడం మొదలుపెడితే ఆపడం ఎవరి వల్ల కాదు.మన ఇండియన్ క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అయితే మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మహీ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పనున్నారు. వచ్చే ఏడాది కూడా మహీ చెన్నై జట్టులోనే కొనసాగుతాడని మీడియాకు తెలిపారు.అలాగే కోల్‌కతాపై చివరి మ్యాచ్ ను గెలిచిన అనంతరం ధోనీ మాట్లాడుతూ చెన్నై తరఫున వచ్చే సీజన్‌లో ఆడడం అనేది ఫ్రాంఛైజీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. వచ్చే ఏడాది మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్‌లో చేరుతున్న నేపథ్యంలో ఈసారి మెగా వేలం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. వచ్చే ఏడాది వేలంతో వచ్చే పదేళ్ల కోసం జట్టును తయారు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు.