టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం అక్టోబర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రయోజన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకురాలు లక్ష్మీ సౌజన్య.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. దాదాపు 15 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఇక ఇలాగే ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉండిపోతానేమోనని ‘వరుడు కావలెను’ కథ రాసుకుని దర్శకురాలిగా మారాను.
∙2017లో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్ను నిర్మాత చినబాబుకు చెప్పగా.. ఆయనకు నచ్చింది. ఆ తర్వాత పూర్తి కథ తయారు చేస్తే..ఓకే అన్నారు. అయితే పలు కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. ఇక తొలిక ఈ సినిమా స్టోరీని నాగ చైతన్యకు చెప్పాను. కానీ, పలు కారణాల వల్ల ఆయన రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత శౌర్యకు వినిపించగా.. ఆయనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పారు. ప్రకృతి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కుటుంబంతో కలిసి హాయిగా ఆస్వాదించవచ్చు` అంటూ లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు.