మొత్తం 19 మందితో గ్రాండ్గా ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఇంకా 12 మందే ఉన్నారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతాలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారం ప్రియ బ్యాగ్ సద్దేసింది. ఇక ఈ రోజు సోమవారం.
సోమవారం వచ్చిందంటే.. బిగ్ బాస్ హౌస్ నామినేషన్ కార్యక్రమంతో నిప్పుల కుంపటిగా మారిపోతుంది. ప్రేక్షకులు కూడా ఎవరెవరు నామినేట్ అవుతారా అని ఈగర్గా వెట్ చేస్తుంటారు. అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. ఎనిమిదో వారం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయినట్టు తెలుస్తోంది.
లోబో, యాంకర్ రవి, షణ్ముఖ్, విశ్వ, మానస్, ప్రియాంక సింగ్ మరియు ఆనీ మాస్టర్లు ఎనిమిదో వారం నామినేట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. ఆ ఏడిగురిలో ఒకరు ఔట్ కానున్నారు. మరి ఆ ఒకరు ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.