డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిల రిలేషన్పై ఇప్పటికే ఎన్నెన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత నటనకు గుడ్బై చెప్పేసి పూరీతోనే తన జర్నీ కొనసాగిస్తుంది. ఇద్దరూ కలిసి పూరీ కనెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థను స్థాపించి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలోనే పూరి-ఛార్మిల మధ్య ప్రేమ చిగురించిందని, వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని ఎన్నెన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. దాంతో ఛార్మి మా ఇద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది. అయినా రూమర్లు మాత్రం ఆగలేదు. ఇక చేసేదేమి లేక ఛార్మి-పూరిలు పుకార్లను పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటున్నారు. అయితే వీరి రిలేషన్పై పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆకాష్ మాట్లాడుతూ..ఛార్మీ గారు నాన్నకు చాలా సపోర్టివ్ గా ఉంటారు.. ప్రొడక్షన్ ఫీల్డ్ లో చాలా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తారు.. నాన్న దర్శకత్వం లో బిజీగా ఉన్నప్పుడు , నిర్మాణ రంగంలో ఛార్మి గారు బాగా హెల్ప్ చేస్తారు.. మంచి స్నేహ బంధం ఉంది కాబట్టే మా నాన్న ఛార్మీని వదలరు అంటూ చెప్పుకొచ్చాడు.