టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించకపోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్స్టాలో పోస్టులు పెడుతోంది. మరియు హాట్ హాట్ ఫొటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది.
దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత ముంబైకి మకాం మార్చేస్తుందట. ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్లోనూ నటించి దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది.
ముఖ్యంగా బాలీవుడ్లో సమంతకు మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే కొన్నాళ్ల పాటు అక్కడ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని, అక్కడ తనకంటూ ఓ పీఆర్నీ, మేనేజర్ని నియమించుకుందని తెలుస్తోంది. అయితే మరోవైపు మాత్రం సమంత ముంబైకి వెళ్లిపోవడానికి కారణం చైతో విడాకులే అంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియాలంటే సమంత లేదా చై, సమంతలు నోరు విప్పాల్సిందే.