ఓటీటీ లో తలైవి సినిమా.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అలాగే విమర్శకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డ్ విజేత కంగనా నటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఈమె నటన కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో ఎంజీ రామచంద్రన్ పాత్రలో అరవిందస్వామి నటించారు. కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. శశికళ గా పూర్ణ నటించింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 26న ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలకానుంది .