బాలీవుడ్ భామ శిల్పా శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత.. శిల్పా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.
అయితే తాజాగా శిల్పా శెట్టి గుర్రంపై అమ్మవారి దర్శనానికి వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి జమ్ముకశ్మీర్కు వెళ్లి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు సైతం నిర్వహించింది. ఈ సందర్భంగా శిల్పా గుర్రపు స్వారీ చేస్తూ ఆలయానికి చేరుకుంది.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన శిల్పా..`ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి పిలుపు మేరకే దర్శననానికి వచ్చాను` అంటూ చెప్పుకొచ్చింది.