ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏకంగా …?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు.ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే ప్రభాస్ అండ్ హీరో గోపీచంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన ‘జిల్’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ప్రభాస్ వచ్చిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది.ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ తన డియరెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ నటించిన “సీటీమార్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నాడని ఒక వార్త ప్రచారంలో ఉంది.

అయితే ఇది కేవలం పుకారా లేక నిజామా అనే విషయంపై క్లారిటీ లేదు.అసలు ఈ ఫంక్షన్ కి ప్రభాస్ గెస్ట్ గా వస్తాడా.. రాడా అనే కన్ఫ్యూషన్ అందరిలో ఉండిపోయింది.అలాగే సిటిమార్ చిత్ర బృందం కూడా ఈ విషయం పట్ల ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సిటిమార్ చిత్రంలో గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ నెల 10వ తారీఖున ఈ చిత్రం రిలీజ్ అవ్వబోతుంది.