కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాతి కాలంలో జనం ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ బాట పట్టారు. ఇక మొన్నటి వరకు థియేటర్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి కాబట్టి జనాలు ఓటీటీల ద్వారా వినోదాన్ని పొందారు. ఈ క్రమంలోనే కొత్త ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి ‘ఆహా’. వంద శాతం తెలుగు కంటెంట్తో డిజిటల్ వరల్డ్లో అడుగుపెట్టిన ఈ ప్లాట్ ఫాం ప్రస్తుతం దూసుకుపోతున్నది. డిఫరెంట్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ ఫిల్మ్స్తో పాటు ఇతర భాషల సినిమాలను తెలుగులోకి అనువదించి తెలుగు వారికి అందిస్తుంది.
అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్లాట్ ఫాం మరింత ముందకు తీసుకెళ్లేందుకుగాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్తో ఓ స్పెషల్ షో లేదా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అది ‘ఆహా ఒరిజినల్’గా అందరి ముందరకు వచ్చే చాన్స్ ఉంది. ఇకపోతే మెగాస్టార్ ఇప్పటికే ‘సామ్ జామ్’ టాక్ షోలో పార్టిసిపేట్ చేసిన సంగతి అందరికీ విదితమే.