ఎన్టీఆర్ హీరోయిన్ పై.. దుండగులు దాడి.. అంతా ప్లాన్ ప్రకారమే..!

ఈ మధ్యకాలంలో దుండగులు ఎక్కువగా నటీనటుల మీదే పడుతున్నారు. ఇక మొన్న ఒక హీరోయిన్ ఇంట్లో దోపిడీ జరగగా..ఈ రోజున ఏకంగా ఒక హీరోయిన్ పై యాసిడ్ దాడికిదిగారు.ఆ హీరోయిన్ ఎవరంటే.. పాయల్.. ఈమె పై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఆ వివరాలను చూద్దాం.

ముంబైలోని ఒక వీధిలోని మందుల షాపులో మందులు కొనుక్కొని తిరిగివస్తుండగా కార్ లో కూర్చున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పాయల్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె తెలిపిన ప్రకారం కొంతమంది దుండగులు మాస్కు ధరించుకొని వచ్చి, ఒకరి చేతిలో రాడ్డుతో పాటు,వేరొకరి చేతిలో యాసిడ్ బాటిల్ కూడా ఉందని పాయల్ తెలిపింది. అయితే ఈ దాడి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్నట్లు తెలియజేసింది.

Jr NTR's Oosaravelli Co-Star Payal Ghosh Says, 'Tarak Knows How To Respect  Women' - Filmibeat

ఇక అలా తప్పించుకుంటారు సమయంలో తన చేతికి గాయాలయ్యాయి అని తెలిపింది. వారు తనపై దాడికి దిగే సమయంలో గట్టిగా అరవడంతో అక్కడినుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి ఘటన ఎప్పుడూ తన జీవితంలో జరగలేదు ఇది మొదటిసారి అని చెప్పుకొస్తోంది.ఈ విషయంపై ఆమె పోలీస్ కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేసింది. కేవలం ఎవరు పక్కాగా ప్లాన్ ప్రకారమే చేశారు అన్నట్లుగా తెలియజేస్తోంది.ఈ బ్యూటీ తెలుగులో ప్రయాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఊసరవెల్లి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆమె సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేయలేదు.https://www.instagram.com/p/CUC0mLWqlbo/?utm_source=ig_embed&ig_rid=0a2fbcc8-0b99-49a8-8a83-f685e5259652