టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..ఓ ప్రముఖ ఛానల్ ఈచిత్ర శాటిలైట్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కూడా అమ్ముడయ్యాయట. మొత్తంగా శాటిలైట్ రైట్స్ మరియు ఇతర భాషల డబ్బింగ్ హక్కులు కలిపి రూ. 20 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు. షూటింగ్ పూర్తి కాకుండా.. ఫస్ట్ లుక్ – టీజర్ వంటివి రిలీజ్ అవకుండానే ఈ సినిమా హక్కులు అంత భారీ ధరకు అమ్ముడవడం నిజంగా విశేషమనే చెప్పాలి. కాగా, ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. కాల బైరవ మ్యూజిక్ అందిస్తున్నారు.