నాగ్..తారక్.. మధ్య వార్.!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీషో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ పోయిన ఆదివారం నుంచి ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే షోకి వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు . ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్ లుగా పాల్గొనడం గమనార్హం. ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఒకదానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా , మరొకదానికి నాని చేశాడు.. మిగతా రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడం గమనార్హం . ఇప్పుడు ఐదవ సీజన్ కు కూడా ఇతనే రావడంతో ప్రేక్షకులు నాగార్జున వద్దు, ఎన్టీఆర్ కావాలని అంటున్నారు.

మూడు, నాలుగు సీజన్ లతో ప్రేక్షకులను బాగా అలరించిన నాగార్జున, ఐదవ సీజన్ తో ప్రేక్షకులలో ఫుల్ జోష్ నింపాలని చూస్తున్నాడు.. ఈ తరుణంలోనే ఈయన పై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు రావడం గమనార్హం. మొదటి షో తోనే ప్రేక్షకులు అనాసక్తిగా మొదలైనట్లు తెలుస్తోంది.. అంతేకాదు నాగార్జున మాటలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదనే కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జునకు బదులు ఎన్టీఆర్ కావాలని తెలుస్తోంది. అంతే కాదు విజయ్ దేవరకొండ అయితే ఇంకా బాగుంటుంది అని అభిమానులు తమ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికీ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా టిఆర్పి రేటింగ్ పెద్దగా రావట్లేదు.. ఇక దీంతో షోలో కంటెంట్ ఉండాలి కానీ హోస్ట్ తో అవసరంలేదు అనే కామెంట్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.