రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

Mahesh Babu takes the first dose of Covid-19 vaccine; urges everyone to do so | Telugu Movie News - Times of India

పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్రకారం..మ‌హేష్ కోసం రాజ‌మౌళి ఇంకా క‌థ సెట్ చేయ‌లేద‌ని తెలుస్తోంది.

RRR director SS Rajamouli complains of lack of proper facilities at Delhi airport. Read full post - Movies News

అంతేకాదు, క‌థ విష‌యంలో మ‌హేష్‌ రాజ‌మౌళికే త‌ల నొప్పి తెప్పిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే.. రాజ‌మౌళి, మ‌హేష్‌ల మ‌ధ్య క‌థ‌కు సంబంధించి ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. మ‌హేష్‌కు రాజ‌మౌళి ఏకంగా మూడు లైన్లు వినిపించాడ‌ట. కానీ, అందులో ఏ ఒక్క‌టీ మ‌హేష్ కి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. దాంతో రాజ‌మౌళి చేసేదేమి లేక త‌న తండ్రి, స్టార్ రైట‌ర్‌ విజయేంద్ర ప్రసాద్‌కు మ‌రో బ‌ల‌మైన లైన్ త‌యారు చేయ‌మ‌ని చెప్పార‌ట‌. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.