నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుము సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక మొదటి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసేస్తుంది.
తొలి రోజు తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. నిన్న ఆదివారం కూడా ఇంతే స్థాయిలో కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉన్నప్పటికీ ఈ మూవీ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. అక్కడ మొత్తం రెండు రోజుల షేర్ రూ.6 కోట్లకు పైగా ఉందని సమాచారం.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకుగానూ రూ.12 కోట్లను రాబట్టిందట. ఇక యూఎస్లోనూ లవ్ స్టోరీ భారీ కలెక్షన్స్తో దుమ్మ దులిపేస్తుంది. ప్రిమియర్లు, తొలి రోజు వసూళ్లతోనే 6 లక్షల డాలర్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. శనివారం 2.88 లక్షల డాలర్లును అందుకుని బాక్సాఫీస్ను హీటెక్కించేసింది. ఇక ఆదివారం కలెక్షన్స్తో ఈ చిత్రంలో మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిపోబోతోందని సమాచారం.