జూనియర్ ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు జరిగిన అవమానాల గురించి తెలిపాడు.

ఓ కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ తారక్ తాను చాలా లావుగా ఉన్న సమయంలో ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపాడు. లావుగా, అసహ్యంగా ఉన్నావు తనను చాలా మంది కామెంట్స్ చేయడంతో పాటు ఘోరావ్ కూడా చేశారని పేర్కొన్నాడు. అయితే, ఆ తర్వాత కాలంలో తారక్ సన్నబడి మళ్లీ సినిమాల్లో అలరించిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత తారక్, చెర్రీ పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు. ఆల్రెడీ ఈ సినిమా తర్వాత చేయబోయే పాన్ ఇండియా సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ కూడా అయింది. కొరటాల శివతో తారక్ పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నాడు.

గతంలో వీరి కాంబోలో ‘జనతా గ్యారేజ్’ సినిమా రాగా, అది సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చే సినిమా తర్వాత తారక్ ‘కేజీఎఫ్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆ ప్రాజెక్టకు సంబంధించిన స్క్రిప్ట్ తారక్‌కు ప్రశాంత్ వినిపించినట్లు వినికిడి. ‘సలార్’ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తారక్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.