తేజ్ యాక్సిడెంట్‌పై హరీశ్ శంకర్ సంచ‌ల‌న ట్వీట్‌..జర్నలిస్ట్ ఆగ్ర‌హం!

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురై.. ప్ర‌స్తుతం అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించ‌గా.. తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెల‌బ్రెటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ యాక్సిడెంట్‌పై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు పుట్టుకువ‌స్తున్నాయి.

Tollywood actor Sai Dharam Tej hospitalized after a bike accident, suffers  collor brone fracture - The Economic Times Video | ET Now

తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. `హాట్స్ ఆఫ్ తమ్ముడు సాయి తేజ్. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని బతికేస్తున్న అందరు బాగుండాలి. వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను` అంటూ మీడియాకు మంట పుట్టేలా హ‌రీష్ శంక‌ర్ ట్వీట్ చేశాడు.

Filmmaker Harish Shankar receives heartwarming birthday wishes | Telugu  Movie News - Times of India

దాంతో హ‌రీష్ శంక‌ర్ ట్వీట్‌పై జ‌ర్న‌లిస్ట్ దొంతు రమేశ్ స్పందిస్తూ.. `ఈ మధ్య మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది, తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ మ‌మ్మ‌ల్ని తప్పు పడతారు` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. అయినా హ‌రీష్ శంక‌ర్ త‌గ్గ‌లేదు..`తప్పుడు వార్తలు అని క్లియర్‌గా చెప్పానని, మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారంటూ` కౌంట‌ర్ వేశారు. మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది, మీకేముంది మీరు దేనికి సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.

https://twitter.com/harish2you/status/1436718582323298305?s=20