ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లు తర్వాత బుల్లితెరపై నటిస్తున్న నటులకు,యాంకర్లకు బాగానే రెమ్యూనరేషన్ అందుతోంది.మన టాలీవుడ్ లో నడుస్తున్నటువంటి కొంతమంది.. నటుల రెమ్యూనరేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆ వివరాలను చూద్దాం.
1). సుమ:
బుల్లితెరపై నెంబర్వన్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది సుమ కనకాల. ఈమె ఒక్కో ఆడియో ఫంక్షన్ కు దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు తీసుకుంటుందని టాక్.మరే ఇతర ఫంక్షన్లకు అయినా మరో రేటు ఉంటుంది అన్నట్లుగా సమాచారం.
2). రష్మి:
ఎక్స్ట్రా జబర్దస్త్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈమె. ఇక ఈమె దాదాపుగా లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
3). అనసూయ:
జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాయి.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది అనసూయ. ఈమె ఒకో ఈవెంట్ కు దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
4). వంటలక్క:
కార్తీకదీపం సీరియల్ ద్వారా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్.ఒక ఎపిసోడ్ కు 30 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
5). శ్రీముఖి:
యాంకర్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాలలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది శ్రీముఖి. దాదాపుగా ఒకోఈవెంట్ కు లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
6). యాంకర్ శ్యామల:
ఈమె ఒక్కో ఈవెంట్ కు 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక వీరే కాకుండా యాంకర్ ప్రశాంతి, సుహాసిని ఇలా ఎంతో మంది దాదాపుగా 10 నుంచి 25 వరకు ఒక ఎపిసోడ్కి తీసుకుంటున్నట్లు సమాచారం