సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి బైక్ రేసింగ్ కి సంబంధం ఉందా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు ఎక్కడ చూసినా కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. ఈ విషయంలో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో పోలీసుల విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బైక్ రేసింగ్ వల్లే సాయి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి తేజ్ బైక్ పై బయలుదేరడానికి ముందుగా నరేష్ ఇంటికి వెళ్లాడు. నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ, అలాగే సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు.

అయితే వీరిద్దరూ కలిసి బైక్ రేసింగ్ కి బయలుదేరారని ఇద్దరి మధ్య పోటీ పెట్టుకోవడంతో సాయి తేజ్ అతి వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదానికి గురయ్యారని సమాచారం. పోలీసులు కూడా ఆవేశం వల్లే సాయితేజ ప్రమాదానికి గురయ్యింది అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ టీవీ పుటేజ్ లో కూడా అది రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.