ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండొవ చిత్రాన్ని క్రిష్తో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్డ్రాప్లో ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇలాంటి అప్డేట్స్ ఏవీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలకు డేట్ లాక్ చేశారు మేకర్స్. ఆగష్టు 20న ఉదయం 10 గంటల 15 నిమిషాలకు టైటిల్ & ఫస్ట్ లుక్ను రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
కాగా, ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
https://twitter.com/DirKrish/status/1427846877815341058?s=20