న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది.
అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. జనాలు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో టక్ జగదీష్ను విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. టక్ జగదీష్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ రైట్స్ను ఏకంగా రూ. 45 కోట్లకు కొనుగోలు చేసిందని.. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.