మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. మలయాళ హిట్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ ఓ కీతక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అయితే ఆ పాత్ర కోసం సల్మాన్ను చిరు స్వయంగా సంప్రదించారట. దాంతో సల్మాన్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ పాత్ర చాలా చిన్నది. అయినప్పటికీ.. ఆ బిగ్ స్టార్ నటిస్తే.. సినిమాకు హైలైట్ అవుతుందని చిరు భావించారట. ఈ నేపథ్యంలోనే చిరు కన్ను సల్మాన్పై పడిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.