ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాలతో పాటుగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక సినిమాలు చేయడం ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక..`నేను ఇలా వరుసపెట్టి సినిమా షూటింగ్స్లో పాల్గొనడం అమ్మానాన్నలకు ఏ మాత్రం ఇష్టం లేదు.
కరోనా ముప్పు పూర్తిగా తగ్గే వరకు సినిమా షూటింగ్స్ వాయిదా వేసుకోమని వారు నాకు నచ్చచెప్పారు. కానీ చిత్రీకరణ వాయిదా వేయడం మన చేతుల్లో ఉండదు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లో పాల్గొంటున్నాను.` అని చెప్పుకొచ్చింది. కాగా, తెలుగులో రష్మిక పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు చేస్తోంది. అలాగే మరోవైపు కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది.