యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు రామ్ చరణ్ రానున్నాడని.. ఈ స్పెషల్ ఎపిసోడ్ను ఆగస్టు 15న ప్రసారం చేయనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ స్పెషల్ ఎపిసోడ్.. ఎంతో రంజుగా ఉండబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్ ముఖ్య ఉద్ధేశం.. ఓవైపు ఇఎంకేకి భారీ టీఆర్పీ తేవడం .. మరో వైపు ఆర్ఆర్ఆర్కి కావాల్సినంత ప్రమోషన్ తెచ్చుకోవడం.
అందుకోసమే ఎన్టీఆర్-చరణ్లు ఇద్దరూ స్మాల్ స్క్రీన్పై హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు. మరి వీరు అనుకున్నది ఎంత వరకు జరుగుతుంది..? అటు షోకు టీఆర్పీ, ఇటు సినిమా ప్రమోషన్ తేవడంలో వీరిద్దరూ సక్సెస్ అవుతారా..? అన్నవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఇద్దరు బిగ్ స్టార్లు ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఎలా ఉంటుందో చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఎగ్జైట్గా ఎదురుచూస్తున్నారు.