ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది.

డ్రగ్స్ కేసులో నిందితుల అక్రమాస్తులను జప్తు చేసే విధంగా ఈడీ చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును సబ్మిట్ చేయడం విశేషం.ఒకవేళ వీరిలో ఎవరైనా విదేశీ ట్రాన్సాక్షన్స్ చేసినట్లైతే వారిపై ఫెమా కేసులు నమోదు చేయాలని ఈడీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి సెప్టెంబర్ 22వ తేది వరకు సినీ తారలను ఈడీ విడతల వారీగా విచారణ చేయనుంది.