రాధేశ్యామ్ షూటింగ్ ఫోటోలు వైరల్.. అఘోరాలతో అలా?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పలు సన్నివేశాలను కడప జిల్లాలోని గండికోట లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ లో సత్యరాజ్ అలాగే ఆయనతో పాటు మరికొందరు ఘోరాలతో కలసి ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా ని రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టల్ టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ సినిమా యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ అని తెలుస్తోంది.