ప్రభాస్ ఇకమీదట జాగ్రత్తగా ఉండాల్సిందేనా..?

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి పోయాడు.ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో అమాంతం తన క్రేజ్ను పెంచుకున్నాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక సలార్ సినిమాని కేజిఎఫ్ సినిమా నేపథ్యంలో నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాని 2023 వ సంవత్సరంలో విడుదల అవుతున్నట్లుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమట.ఎందుచేత అంటే తన ప్రతి సినిమాలోను తన పాత్ర కోసం కొత్త లుక్ ను మార్చుకుంటున్నారు. అయితే గ్యాప్ లేకుండా సినిమాలు తీయడం వల్ల తన ముఖంలో గ్లో మిస్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారట.ఇక అంతే కాకుండా తను నటించే సినిమాలలో ఆ సినిమాకు తగ్గట్టుగా తన శరీర ఆకృతిని మార్చుకోవడం వల్ల ఫాన్స్ చాలా ఫిదా అవుతున్నారు. కేవలం ఇది ప్రభాస్ కే సాధ్యం అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు తన అభిమానులు.

అయితే ప్రభాస్ ఇలా చేయడం వల్ల ముఖంలో గ్లో పోతుందని కూడా మరికొంతమంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ప్రభాస్ కు తగినంత విశ్రాంతి అవసరం అని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రాలు కాబట్టి అందుచేతనే ప్రభాస్ కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే మేలని తన అభిమానులు ఆలోచిస్తున్నారు.